తెలుగుదేశం క్యాడర్ త్యాగాలకు సిద్ధమేనా!

ఏపీలో విపక్షాలు జట్టుగా కూటమి కట్టడం ఆయా పార్టీల నేతల్లో గుబులు పుట్టిస్తుంది. పొత్తుల్లో భాగంగా కొంతమంది తమ తమ సీట్లను వదులుకోవాల్సి వస్తుంది అయితే ఆ వదులుకోవాల్సి సీట్లు ఏవి ఆ అభ్యర్థులు ఎవరు అనేది ఇంతవరకు లెక్క తేలలేదు దీంతో పొత్తులో భాగంగా ఈ సీట్ వేరే పార్టీకి పోవచ్చు అని ఉహాగానాలు ఉన్న స్థానాల్లో ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న నాయకులు ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటో అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బీజేపీ జనసేన వల్ల టీడీపీ క్యాడర్ లో ఆందోళన!

టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తు ఖారారు అవుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్థానికంగా నియోజకవర్గాలలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ 2019 ఎన్నికలకు బీజేపీ మీద కత్తులు దూసిన మేము ఇప్పుడు వాళ్ళతో కలిసి ఎలా పని చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఎప్పటినుంచో పొత్తు వార్తలు ఉన్నాగాని ఇప్పుడు అధికారికంగా పొత్తులో ఉన్నా సరే ఇంతవరకు జనసేనతో సమన్వయము లేదు అందులోను మోడీ ప్రభుత్వం మీద చంద్రబాబు తీవ్ర పదజాలాలతో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ పొత్తు ఎంతమేరకు సక్సెస్ అవుతుందో అనే ఆలోచనలో టీడీపీ క్యాడర్ ఉందంట.

టికెట్ త్యాగం చెయ్యాల్సింది ఎవరెవరో !

బీజేపీకి జనసేనకు కలిపి కనీసం 50 నుండి 65 స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది అనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాలు ఏవి టికెట్ వదులుకోవాల్సి త్యాగ రాజులు ఎవరు అనే చర్చే ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్లో ప్రధానంగా ఉంది అంట ఒకవేళ స్థానిక టీడీపీ నాయకునికి కాకుండా వేరే పార్టీయే వాళ్లకు టికెట్ కేటాయిస్తే వాళ్ళను తమ భుజాల మీద ఎక్కించుకోవాల్సిన అవసరం తమకు ఏంటి అనే భావనలో టీడీపీ క్యాడర్ ఉంది.

Leave a Comment