ప్రకాశం జిల్లా వైసీపీలో అయోమయం

జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పిడి కాకరేపుతుంది మంత్రి సురేష్ ను ఎరగొండపాలెం నుండి కొండెపికి కొండేపికి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ ను ఎరగొండపాలెం ఇంచార్జిలుగా వైసీపీ అధిష్టానం నియమించింది.

వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ పరంగా తన గళాన్ని బలంగా వినిపించడంతో పాటు మాజీ మంత్రి బాలినేని ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఇక్కడ ఇంచార్జ్ గా నియమితులయ్యారు.

కాకపోతే ఆ నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గానీ ఆయనకు చెందిన ప్రధాన అనుచరగణం కానీ తాటిపర్తికి సహకరించట్లేదు.

ఇక్కడ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి సురేష్ ను ఆహ్వానించినప్పటికీ రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు అని టాక్.

అయినా సరే తాటిపర్తి చంద్రశేఖర్ నియోజకవర్గం లోనే ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు.

కార్యకర్తల్లో అయోమయం

కార్యకర్తలు మాత్రం కొత్త నేత వద్దకు వెళ్లాలా లేక పాత నేత అనుచరులతో ఉండాలో తెలియక అయోమయంలో ఉన్నారు.

ఏదేమైనా వైసీపీకి కంచుకోట లాంటి ఈ సీట్ లో అధిష్టానం ఈ చిన్న సమస్యలను త్వరగా పరిష్కరించకుంటే మూల్యం తప్పక పోవచ్చు.

Leave a Comment