ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు

ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది.

ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

అలాగే ఎంపీల్లో నంద్యాల, గుంటూరు, నరసరావుపేటతో పాటు పలు సీట్లలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి ప్రకటించే ఐదో జాబితాలో కనీసం నలుగురైదుగురు ఎంపీలు ఉంటారని తెలుస్తోంది. వీరి స్ధానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదా కొత్త అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పెందుర్తి లేదా అనకాపల్లి ఎంపీ సీటులో పోటీ చేయించే అవకాశం ఉంది.

రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఐదో జాబితా వెలువడే అవకాశముంది.

Leave a Comment