రామోజీకి షాక్‌! మార్గదర్శికి సుప్రీంకోర్టు ఝలక్‌

సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్‌ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి పిటిషన్లను అనుమతించే​ ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది.

ఏపీ ప్రభుత్వ వాదనలు..

ఆంధ్రప్రదేశ్‌లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నేరాలకు పాల్పడింది. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు. ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏటా రూ.3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది. సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. చిట్‌ఫండ్స్‌ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి. ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు. ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పింది. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం. కేసులో దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేస్తోంది.

మార్గదర్శిపై ఏపీ సీఐడీ దర్యాపు..

మార్గదర్శి చిట్‌ఫండ్‌ చైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే, అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు?.

రికార్డుల్లో ఏముంది?

హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్‌ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్‌, నవంబర్‌ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్‌ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్‌ రిసివెబుల్స్‌ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్‌ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి.

కొన్ని వెబ్‌సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌​(తెలంగాణ)-రూ.20.20కోట్లు
డాల్ఫిన్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.36.32కోట్లు
మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌(తమిళనాడు)-రూ.50లక్షలు
మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌(కర్ణాటక)-రూ.50లక్షలు
మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ లీజింగ్‌ కో ప్రైవేట్‌ లిమిటెడ్‌-రూ.52.02లక్షలు
మార్గదర్శి ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.75లక్షలు
ఉషాకిరణ్‌ మూవీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.99లక్షలు
బాలాజీ హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఆంధ్రప్రదేశ్‌)-రూ.65.06లక్షలు
ప్రియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)​‍-రూ.1లక్ష
రామోజీ మల్టీమీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.2.06కోట్లు
ఓం స్ప్రిచ్‌వల్‌ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు
ఓం స్ప్రిచ్‌వల్‌ సిటీ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.26లక్షలు
మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.44.77కోట్లు
ఉషోదయ షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.1.80కోట్లు
రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.9.44కోట్లు
మార్గదర్శి హౌజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.3.88కోట్లు
మాన్‌పవర్‌ సెలక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.1లక్ష
వెరైటీ మీడియా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఆంధ్రప్రదేశ్‌)-రూ.1లక్ష
బాల్‌భారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.1లక్ష,
బాల్‌భారత్‌ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు
రామోజీ కిరణ్‌ ఫిల్మ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.50లక్షలు
ఈనాడు టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(తెలంగాణ)-రూ.24.87కోట్లు.

ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్‌​ విలువ చాలారెట్లు ఎక్కువ.

Leave a Comment