జనసేనలోకి బాలశౌరి! మచిలీపట్నం ఎంపి గా వంగవీటి రాధా?

ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎంపిగా ఉన్న బాలశౌరి పార్టీకి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వంగవీటి రాధా ను అక్కడ ఎంపి గా పోటీ చేయించే విధంగా వైసీపీ అధిష్టానం రాధాతో సమాలోచనలు చేస్తున్నారట.త్వరలోనే వైసీపీలోకి వంగవీటి రాధా చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

వైసీపీ అధినాయకత్వం కూడా రాబోయే ఎన్నికలలో తనకు టికెట్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని బాలశౌరికి తెలియజేసినట్టు సమాచారం తనకు టికెట్ లేదని నిర్ధారించుకొన్న తర్వాతే బాలశౌరి పార్టీకి కూడా రాజీనామా చేశారు.

జనసేనలోకి బాలశౌరి!

బాలశౌరి జనసేనలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల (X) ద్వారా ధృవీకరించారు
జనసేనలో మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ కి సంబంధించి హామీ పొందిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిస్తుంది.

ఈ నిర్ణయాన్ని టీడీపీ స్వాగతిస్తుందా?

మరి మచిలీపట్నం టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారా ఒకవేళ కేటాయిస్తే స్థానిక తెలుగుదేశం నాయకులు దానిని ఎంత వరకు స్వాగతిస్తారు అనేది ప్రశ్నార్థకం.

Leave a Comment