ఏపీలో విపక్షాలు జట్టుగా కూటమి కట్టడం ఆయా పార్టీల నేతల్లో గుబులు పుట్టిస్తుంది. పొత్తుల్లో భాగంగా కొంతమంది తమ తమ సీట్లను వదులుకోవాల్సి వస్తుంది అయితే ఆ వదులుకోవాల్సి సీట్లు ఏవి ఆ అభ్యర్థులు ఎవరు అనేది ఇంతవరకు లెక్క తేలలేదు దీంతో పొత్తులో భాగంగా ఈ సీట్ వేరే పార్టీకి పోవచ్చు అని ఉహాగానాలు ఉన్న స్థానాల్లో ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న నాయకులు ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటో అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తు ఖారారు అవుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్థానికంగా నియోజకవర్గాలలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ 2019 ఎన్నికలకు బీజేపీ మీద కత్తులు దూసిన మేము ఇప్పుడు వాళ్ళతో కలిసి ఎలా పని చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఎప్పటినుంచో పొత్తు వార్తలు ఉన్నాగాని ఇప్పుడు అధికారికంగా పొత్తులో ఉన్నా సరే ఇంతవరకు జనసేనతో సమన్వయము లేదు అందులోను మోడీ ప్రభుత్వం మీద చంద్రబాబు తీవ్ర పదజాలాలతో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ పొత్తు ఎంతమేరకు సక్సెస్ అవుతుందో అనే ఆలోచనలో టీడీపీ క్యాడర్ ఉందంట.
బీజేపీకి జనసేనకు కలిపి కనీసం 50 నుండి 65 స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది అనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాలు ఏవి టికెట్ వదులుకోవాల్సి త్యాగ రాజులు ఎవరు అనే చర్చే ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్లో ప్రధానంగా ఉంది అంట ఒకవేళ స్థానిక టీడీపీ నాయకునికి కాకుండా వేరే పార్టీయే వాళ్లకు టికెట్ కేటాయిస్తే వాళ్ళను తమ భుజాల మీద ఎక్కించుకోవాల్సిన అవసరం తమకు ఏంటి అనే భావనలో టీడీపీ క్యాడర్ ఉంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…
The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…
సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…
ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…