టీడీపీ తరుపున పెద్దగా ఫైట్ ఉండదు అనుకుని మొదటి నుండి ఈ సెగ్మెంట్ లో జనసేన బలంగా పనిచేసుకుంటూ వచ్చింది
అంతా సవ్యంగానే ఉంది టికెట్ జనసేనకి ప్రకటించడమే లేటు అనుకునే సమయంలో గంటా శ్రీనివాస్ రూపంలో ఒక బిగ్ చెక్ పాయింట్ భీమిలిలో సిద్ధంగా ఉంది.
2019లో విశాఖ నార్త్ నుండి గెలిచిన గంటా శ్రీనివాస్ ఇక అక్కడినుండే మళ్లీ పోటీ చేస్తారు అనుకుంటున్న తరుణంలో ఆయన తనకు భీమిలి టికెట్ ఇవ్వాల్సిందే అంటూ తెలుగుదేశం అధిష్టానానికి ఆల్టీమేటం జారీ చేశారు.
2019లో టీడీపీ తరుపున పోటీ చేసిన సబ్బం హరి ఆ ఎన్నికల తర్వాత చనిపోవడంతో అక్కడ బలమైన తెలుగుదేశం కేడర్ ను నడిపించే నాయకుడు లేని కొరత అలానే ఉంది ఇదే అదునుగా భావించిన గంటా ఒకప్పడు తను ఇక్కడనుంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ టికెట్ తనకే కావాలి అని పట్టుబడుతున్నారు అని సమాచారం జనసేనను ఒప్పించడానికి కూడా టీడీపీ పెద్దల ద్వారా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు అంట అవసరమైతే చిరంజీవి వైపు నుండైనా కథ నడపడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా స్థానిక టీడీపీ ఇంచార్జ్ మాత్రం గంటా ఇక్కడికొస్తే సహకరించబోము అంటూ కుండ బద్దలు కొడుతున్నారు.
టీడీపీలో పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు ఇదే టికెట్ మీద పోటీకి సిద్ధమవుతున్న జనసేన పరిస్థితి ఇక్కడ విచిత్రంగా ఉంది సర్వేల ఆధారంగా ఇక్కడ గెలిచేది జనసేన పార్టీయే అని వాళ్లు చెప్తూ పోటీకి అభ్యర్థి అన్వేషణలో ఉన్నారు. కూటమిలో ఉన్న రెండు పార్టీలు ఈ సెగ్మెంట్ విషయంలో వెనక్కి తగ్గేలా లేకపోవడంతో ఇక్కడి రాజకీయం రసందాయకంలో ఉంది.
చూద్దాం ఏం జరుగుతుందో!
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…
The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…
సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…
ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…